రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి... ఆరోజే కీలక ప్రకటన!

TG: రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 17న ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. కాగా అదే రోజు కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

New Update
CM REVANTH RAHUL

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఆయన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి హస్తినకు వెళ్లనున్నారు. ఎల్లుండి అక్కడ జరిగే కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ తో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. కాగా రేపు సాయంత్రం ఢిల్లీకి చేరుకొని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి కలిసే ఛాన్స్ ఉంది.

ఇది కూడా చదవండి: మహా ఎన్నికలకు మోగనున్న నగారా!

మంత్రి పదవుల భర్తీ...

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 10 నెలలు గడుస్తున్న రాష్ట్ర కేబినెట్ మాత్రం ఇంకా భర్తీ కాలేదు. ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి వర్గంలో ముఖ్యమైన విద్యాశాఖకు ఇప్పటి వరకు మంత్రి లేడు. దీనిపై పలుమార్లు ప్రతిపక్షాలు బీజేపీ ,  బీఆర్ఎస్ విమర్శలు చేసిన.. చేస్తున్న కాంగ్రెస్ మాత్రం పెద్దగా స్పందించడం లేదు. మరోవైపు  సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తానే మిగిలిన శాఖలకు మంత్రిని అని ఓ మీడియా సమావేశంలో బహిరంగ ప్రకటన చేశారు. కాగా అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్న ఇంకా నామినేటెడ్ పదవులు, మంత్రి వర్గం విస్తరణ కాకపోవడం అనేక చర్చలకు దారి తీస్తోంది.

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

పదవుల కోసం ఎదురుచూపులు...

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తమ ఎమ్మెల్యే టికెట్లను వదులుకున్న నేతలు, పార్టీ కోసం పని చేసిన నేతలు.. ఇలా అందరి చూపు నామినేటెడ్ పోస్టులపై ఉంది. మరోవైపు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి కూర్చుకోసం హస్తినలో ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా నామినేటెడ్ పదవులు, మంత్రి వర్గ విస్తరణపై ఎల్లుండి జరిగే సమావేశంలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి:

టీచర్ల పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా!

Advertisment
Advertisment
తాజా కథనాలు