ఎమ్మెల్సీలుగా అద్దంకి, విజయశాంతి.. ఏకగ్రీవంగా ఎన్నికైన వారి లిస్ట్ ఇదే!

అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ MLCలుగా ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారులు వీరికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వీరి ఐదు నామినేషన్లు మాత్రం రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.

New Update
Telangana New MLCs

అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, నెల్లికంటి సూర్యం, దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీలుగా ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మూడు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను నిలపింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి ఛాన్స్ ఇచ్చింది. మరో సీటును సీపీఐకి కేటాయించగా.. ఆ పార్టీ నెల్లికంటి సత్యంను బరిలోకి దించింది.

బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కు అవకాశం లభించింది. ఐదే ఐదు స్థానాలకు ఐదుగురు మాత్రమే బరిలో ఉండడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు గుడువు ముగియడంతో అధికారులు వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాలను అందించారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అసెంబ్లీలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు