America: గుండెపోటుతో అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి!

హనుమకొండకు చెందిన రాజేష్‌ అనే యువకుడు అమెరికాలో గుండెపోటుతో మూడు రోజుల క్రితం మరణించాడు. ఈ విషయాన్ని అతని స్నేహితులు ఫోన్‌ ద్వారా బంధువులకు తెలియజేశారు. దీంతో అతని మృతదేహన్ని రాష్ట్రానికి రప్పించేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు.

Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
New Update

America: అమెరికాలో మరో తెలుగు యువకుడు మృతి చెందాడు. హనుమకొండ జిల్లాకు చెందిన ఏరుకొండ రాజేష్‌ (32) అనే యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. ఆత్మకూరు మండలానికి చెందిన రాజేశ్‌ ఉన్నత చదువుల కోసం తొమ్మిది సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగం కూడా చేస్తున్నాడు.

ఈ క్రమంలో గుండెపోటుతో అస్వస్థతకు గురైన రాజేశ్‌ మూడు రోజుల క్రితం మరణించినట్లు సమాచారం. రాజేష్‌ మరణవార్తను కుటుంబసభ్యులకు అతని స్నేహితులు ఫోన్‌ చేసి తెలియజేశారు. ఈ విషయం తెలియగానే ఆయన కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా, ఆర్థిక సమస్యలతో రాజేష్‌ తండ్రి కొన్ని సంవత్సరాల క్రితమే మరణించాడు. ఇప్పుడు రాజేష్‌ కూడా కన్నుమూయడంతో అతని కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. రాజేష్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

Also Read: నేను పోరాడుతా.. అనర్హత వేటుపై తొలిసారిగా స్పందించిన వినేశ్ ఫొగాట్..

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe