ఉద్యమనేత సాయిచంద్ హఠాన్మరణం తర్వాత…తన భార్య రజనీకి తెలంగాణ సర్కార్ న్యాయం చేస్తూ తక్షణం చైర్పర్సన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ జానపద కళాకారుడిగా తనదైన శైలీలో పాటలు పాడి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా.. క్రియాశీలక పాత్రను పోషించారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సాయిచంద్ బీఆర్ఎస్ విధానాలు, సంక్షేమ పథకాలపై పాటల రూపంలో పాటలు ఆలపిస్తూ జనాన్ని చైతన్యపరిచారు.
పూర్తిగా చదవండి..చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన సాయిచంద్ భార్య రజనీ
తెలంగాణ జానపద కళాకారుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ దివంగత చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ కోసం అసువులు బాసిన శ్రీకాంతాచారి కోసం సాయిచంద్ పాడిన రాతిబొమ్మల్లో కొలువైన శివుడా అనే పాట కేసీఆర్ను సైతం ఏడ్పించింది. ఇక... తన అకాల మరణంతో కన్నీళ్లను దిగమింగుకొని బ్రతుకుతున్న తన భార్యకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారుడి భార్యకు తక్షణ న్యాయం చేసింది. అంతేకాదు తనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది.
Translate this News: