కేటీఆర్ కొడుకు హిమాన్షు ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని సుమారు కోటి రూపాయలతో కార్పొరేట్ స్థాయిలో ఈ స్కూల్ని తీర్చిదిద్దాడు. ప్రస్తుతం ఆ స్కూలుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. హిమాన్షు ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గచ్చిబౌలి కేశవనగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి నాకు మా తాతగారు ఆదర్శం అంటూ అందరిని ఆశ్చర్యపరిచాడు.
పూర్తిగా చదవండి..డాడీ స్పూర్తి, తాత ఆశిస్సులంటూ అచ్చం తాతలాగే మాట్లాడిన హిమాన్ష్
సీఎం కెసిఆర్ మనవడు హిమాన్షు ఈ మధ్యకాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. చదువులో ముందుండడమే కాకుండా, పలు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాంలను ఏర్పాటు చేస్తూ మిగతా విద్యార్థులకు భరోసాను కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే హిమాన్షు మరో ముందడుగు వేసి తన గొప్ప మనసును చాటుకుని తాతకు తగ్గ మనవడిగా ప్రశంసలను అందుకున్నాడు. అంతేకాదు నేను ఇదంతా చేయడానికి ముఖ్యకారణం.. మా తాతగారు కేసీఆర్ గారి ఆశిస్సులు, మా నాన్న నాకిచ్చిన ఇన్సిఫిరేషన్ అంటూ చెప్పుకొచ్చాడు.
Translate this News: