KTR vs Komatireddy: ఎవడ్రా నువ్వు... కేటీఆర్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడిదిరా బానిసత్వ పార్టీ అంటూ నిప్పులు చెరిగారు. కేటీఆర్, అమిత్‌షాని కలిసిన తర్వాత కవిత కేసు ఆగిపోయిందన్నారు కోమటిరెడ్డి. కేటీఆర్‌కి కొంత నాజెడ్జ్ ఉంది అనుకున్నానని ఈరోజు చిట్‌చాట్‌ తర్వాత కేటీఆర్‌కి ఏమీ తెలియదని అర్థమైందన్నారు. కేసీఆర్‌కి దమ్ముంటే ఆయన్ని బండ భూతులు తిట్టిన తలసానిని కేబినెట్ నుంచి తీసేయాలని ఫైర్ అయ్యారు.

New Update
KTR vs Komatireddy: ఎవడ్రా నువ్వు... కేటీఆర్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడిదిరా బానిసత్వ పార్టీ అంటూ నిప్పులు చెరిగారు. కేటీఆర్, అమిత్‌షాని కలిసిన తర్వాత కవిత కేసు ఆగిపోయిందన్నారు కోమటిరెడ్డి. కేటీఆర్‌కి కొంత నాజెడ్జ్ ఉంది అనుకున్నానని ఈరోజు చిట్‌చాట్‌ తర్వాత కేటీఆర్‌కి ఏమీ తెలియదని అర్థమైందన్నారు. కేసీఆర్‌కి దమ్ముంటే ఆయన్ని బండ భూతులు తిట్టిన తలసానిని కేబినెట్ నుంచి తీసేయాలని ఫైర్ అయ్యారు.

కోమటిరెడ్డి ఇంకేం అన్నారంటే?
మీ పార్టీ నుంచి తెలంగాణ ద్రోహులను తీసేయండి -కోమటిరెడ్డి

మంత్రులకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం బానిసత్వం కాదా?

బీఆర్ఎస్‌లో ఇప్పుడు కేసీఆర్, తర్వాత కేటీఆర్‌... ఆ తర్వాత హిమాన్షు ముఖ్యమంత్రి

మా చెల్లిని అరెస్ట్ చేయకండి, ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండని... కేటీఆర్ అమిత్‌షాకి చెప్పి వచ్చాడు.

దళిత బంధు, బీసీబంధులో అక్రమాలపై కోర్టుకు వెళ్తున్నా -కోమటిరెడ్డి

చిట్‌చాట్‌లో బీజేపీపైనా ఫైర్:
‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే ఆలోచన ప్రజల్లో ఉన్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్ని్స్తోందని ఆరోపించారు మంత్రి కేటీఆర్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లకు పైగా గెలుపొంది బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు సీఎం కేసీఆర్‌తో ఏ విషయంలో పోరాడాలో తెలియని అయోమయంలో ఉన్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కరీంనగర్‌ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్‌కుమార్‌ తెలంగాణకు ప్రాజెక్టులు తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఎన్నికల్లో 90 సీట్లకు పైగా గెలుస్తామని.. ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన వస్తోందన్నారు. కేసీఆర్ గెలుస్తారన్న ధీమా మెజారిటీ ప్రజల్లో ఉందని చెప్పారు. దేశ రాజధానిలో ఇటీవల ముగిసిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో, భారతదేశానికి అధ్యక్ష పదవి కేవలం రొటేషన్ ద్వారా వచ్చిందని, అది దేశానికి ఏ విధంగానూ ఉపయోగపడదన్నారు.

ఒక దేశం, ఒక ఎన్నికలు రాజకీయ జిమ్మిక్కు అని కేటీఆర్‌ఫైర్ అయ్యారు. ఇది NDA దృష్టి మళ్లింపు వ్యూహమని.. ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా ఇలాంటి జిమ్మిక్కులను చూశామన్నారు కేటీఆర్‌. 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' అనేది దృష్టి మళ్లింపులో ఒక భాగం. గత తొమ్మిదేళ్లుగా ఎందుకు చేయలేదు? ఇప్పుడు అమలు చేస్తామన్న హామీ ఏమైనా ఉందా? బీజేపీ అలా చేయాలనుకుంటే వారిని ఎవరు ఆపగలరు? పార్లమెంట్‌లో వారికి బుల్‌డోజింగ్‌ మెజారిటీ ఉందని కేటీఆర్‌ మండిపడ్డారు.

ALSO READ: జడ్జి హిమబిందుకి ముప్పు ఉందా? భద్రత పెంపు..!

Advertisment
తాజా కథనాలు