Telangana News: నిజామాబాద్ లో దారుణం.. ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి

తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ దళిత యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

New Update
Telangana News: నిజామాబాద్ లో దారుణం.. ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి

తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ దళిత యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లిలో ఓ యువతిపై నిన్న తౌఫిక్‌ అనే యువకుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ యువతి చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందింది. బాధిత యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ఎలాంటి అవంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జక్రాన్ పల్లిలో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Vishaka Women Death: విశాఖలో దారుణం.. బట్టలు లేకుండా మహిళ డెడ్ బాడీ.. అసలేం జరిగిందంటే?

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు, నిందితుడు తౌఫిక్‌ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిన్న ఆ యువతిని తౌఫిక్ బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. తర్వాత బైక్‌పై నుంచి పడిపోయిందని యువతిని ఇంటి దగ్గర వదిలి వెళ్లాడు. తీవ్ర గాయాలైన యువతిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా.. బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు గుర్తించారు వైద్యులు. అనంతరం చికిత్స పొందుతూ ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.

అయితే.. ఆ యువతిని అత్యాచారం చేసి చంపేశారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురు ఉన్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులను ఉరితీయాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు