తెలంగాణ కాంగ్రెస్ ఫుల్ జోష్లో కన్పిస్తుంది. హస్తం పార్టీకి గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతున్నారు. దీంతో హస్తం పార్టీ నేతలు ఇప్పటి నుంచే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిలో ఎవరుకి ఏ పదవి ఇవ్వాలి, ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలి, నియోజకవర్గల్లో ఏ నేతకు ప్రజల్లో నమ్మకముంది. నియోజకవర్గంపై పట్టున్న నేత ఎవరు..? అనే అంశాలపై చర్చలు జరుపుతుంది. దీనికోసం కాసేపటి క్రితమే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ కీలక నేతలు పార్టీలో చేరబోయ్యే నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ త్వరలో బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Telangana Congress : టీ కాంగ్రెస్లో కొత్త జోష్.. ఇప్పటివరకు ఓ లెక్క.. ఇకపై మరోలెక్క..!
తెలంగాణ కాంగ్రెస్లో నూతనుత్తేజం రాబోతుందా..? చేరికలతో కాంగ్రెస్లో ఫుల్ జోష్లో కన్పిస్తుందా..? కాంగ్రెస్ పార్టీలో చేరబోయే నాయకులు ఎవరు..? వారి చేరికతో బీఆర్ఎస్కు ఎంత నష్టం కల్గనుంది. ఇటీవల పార్టీని వీడినవారు.. పార్టీ నేతలతో టచ్లో లేని వారు హస్తం తీర్థం పుచ్చుకోబోతున్నారా..? వారెవరు..? వారికి ఎలాంటి పదవులు ఇస్తామని కాంగ్రెస్ వలలో వేసుకుంటుంది. హస్తం పార్టీలో కొత్త నేతలకు పదవులు ఉంటాయా ..? ఇన్నాళ్లు ఒక లెక్క ఇక మీదట మరో లేక్క అంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తన మాట మీద నిలబడుతారా అనేది చూడాలి.
Translate this News: