భారత్లో వరుస రైలు ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. మొన్న ఒడిశా రైలు ప్రమాదంలో కొన్ని వందల మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే తెలంగాణ రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మాయిపల్లి – పగిడిపల్లి మార్గంలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అగ్నికి ఆహుతి అయింది. ఈ ఘటన అందరిని ఆందోళన కలిగించింది. ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి బోగీలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ప్రయాణికులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం పగటిపూట జరగడంతో పెను ప్రమాదం తప్పింది.
పూర్తిగా చదవండి..ఫలక్నుమా ఎక్స్ప్రెస్ని వీడని ప్రమాదాలు, ఇది నాలుగోసారి తెలుసా..?
దేశంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం ఒడిశా రాష్ట్రంలో జరిగింది. ఆ షాక్ నుండి తేరుకోకముందే మరో సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. హౌరా - సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురై తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు.. ఏకంగా ఇది నాలుగుసార్లు ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురవడంతో ప్రయాణికులు ఇందులో ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. అయితే రైలు ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Translate this News: