Nalgonda: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుర్చీలో కూర్చొని డెలివరీ అయిన గర్భిణీ ఘటన మరువక ముందే మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. మాడ్గులపల్లి మండలం గ్యారకుంట పాలెంకు చెందిన గర్భిణీ చెరుకుపల్లి శ్రీలతకు బలవంతంగా డెలివరీ చేయడంతో పండంటి శిశువు మృతి చెందాడు.
Also Read: దారుణం.. ప్రేమజంటకు ఆశ్రయం కల్పించినందుకు యువకుడిపై పెట్రోలు పోసి..
ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు బయటికి పోతుండగా, వైద్యురాలు.. వారిని మందలించి ఆపరేషన్ చేస్తామని తిరిగి పిలిచింది. కుర్చీలో డెలివరీ ఘటనలో ఉన్నతాధికారుల మందలించడంతో, కోపంతో ఆపరేషన్ చేసి శిశువును చంపారని బాధితుల ఆరోపణలు చేస్తున్నారు.