మెడికల్ కాలేజీ విద్యార్ధి మృతిపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు సోమిరెడ్డి, కరుణ. వీరిది ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల గ్రామం. వారు అక్కడి నుంచి 20 ఏళ్ల క్రితం హైదరాబాదు శివారులోని పాపిరెడ్డి నగర్ కి వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కొడుకు దీక్షిత్ రెడ్డి మెడిసిన్ చదువుతున్నాడు. దీక్షిత్ రెడ్డికి మానసిక స్థితి సరిగా లేదు. దీంతో గతంలో కూడా ఒకసారి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
పూర్తిగా చదవండి..దారుణం.. మర్మాంగాన్ని కోసుకొని మెడికో విద్యార్ధి ఆత్మహత్య
సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఆదివారం ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న దీక్షిత్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీక్షిత్ రెడ్డి తన మర్మాంగాన్ని కోసుకొని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Translate this News: