తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారం కోసం గులాబీ బాస్ కలలు కంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రెండు దఫాలుగా అధికారాన్ని కొనసాగిస్తున్న టిఆర్ఎస్ పార్టీ మూడవ దఫా కూడా గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తుంటే పార్టీ నేతలు మాత్రం అంతర్గత కలహాలను వదిలిపెట్టటం లేదు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్దం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరి ఆధిపత్య పోరు, టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి తాటికొండ రాజయ్యల మధ్య పంచాయితీ పీక్స్ కి చేరుకుంది.
పూర్తిగా చదవండి..కడియం శ్రీహరిపై, ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు ఎన్కౌంటర్ల సృష్టికర్త అంటూ ఫైర్ అయ్యారు. కులం ఆత్మగౌరవంతో సమానం. కుల ప్రస్తావన జరగాలి పార్టీ నుండి బహిష్కరించిన వారే కడియం శ్రీవారి వెంట ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో నియోజకవర్గంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Translate this News: