తెలంగాణలో జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను (Group-1 Exam) రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీఎస్పీఎస్సీ (TSPSC) డివిజన్ బెంచ్ లో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఈ రోజు విచారణ చేపట్టింది న్యాయస్థానం. పరీక్ష నిర్వహణ విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ ప్రశ్నించింది. మీరే నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలా అంటూ మండిపడింది ధర్మాసనం. ఒకసారి పేపర్ లీక్, ఇప్పుడేమో బయోమెట్రిక్ సమస్య అంటూ.. తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ తీవ్ర వాఖ్యలు చేసింది. అనంతరం విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
పూర్తిగా చదవండి..TSPSC Group-1: గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టులో విచారణ.. కమిషన్ తీరుపై తీవ్ర ఆగ్రహం
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను టీఎస్పీఎస్సీ ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను ఈ రోజు విచారణకు చేపట్టింది న్యాయస్థానం. పరీక్ష నిర్వహణ విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ ప్రశ్నించింది. విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
Translate this News: