Gaddar Statue in Tellapur: బడుగు వర్గాల ఆశాదీపం ..ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటు విషయంలో ఏర్పడిన వివాదానికి తెరపడింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఇటీవల అఖిలపక్షం నాయకులు ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసే౦దుకు సన్నాహాలు చేస్తుండగా గద్దర్ వ్యతిరేక వ్యక్తులు,హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు ఆ పనులు జరుగకుండా అడ్డుకున్నారు. దీంతో విగ్రహ ఏర్పాటు నిలిచిపోవడంతో పలు సంఘాలు ఆందోళన చేపట్టడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ (Tellapur Municipality) చేసిన తీర్మానాన్ని హెచ్ఎండీఏ ఆమోదించి స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంఘాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Gaddar Statue: గద్దర్ విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహం ఏర్పాటు విషయంలో నెలకొన్న అడ్డంకులు సమసిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ఈ వివాదానికి పలు సంఘాల ఆందోళనలు చేపట్టగా ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Translate this News: