గతేడాది నవంబర్ 22వ తేదీన చండ్రుగొండ మండలం, ఎర్రబోడు గ్రామ శివార్లలో విధులలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావును విచక్షణారహితంగా నరికి చంపిన ఇద్దరు నిందితులకు శిక్ష పడింది. భద్రాద్రి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ పాటిల్ వసంత్ సంచలన తీర్పు ఇచ్చారు. ఇద్దరు నిందితులకు యావజ్జీవ శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. చండ్రుగొండ మండలం బెండాళపాడు గ్రామ పంచాయతీ ఎర్రబోడు అటవీ ప్రాంతంలో ప్లాంటేషన్ పనులు పరిశీలించడానికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు వెళ్లారు. అయితే అక్కడ ఎర్రబోడు గ్రామానికి చెందిన గుత్తి కోయలు ఆయన్ని దారుణంగా హత్య చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
పూర్తిగా చదవండి..ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు
గతేడాది తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో భద్రాద్రి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
Translate this News: