Congress Final List: కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్.. ఆ ఐదుగురు అభ్యర్థులు వీరే?

అనేక ట్విస్ట్ ల నడుమ ఎట్టకేలకు 114 మంది అభ్యర్థులను ఫైనల్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇంకా సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్ కు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కొత్తగూడెం సీపీఐకి కేటాయించడంతో ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించనుంది.

Congress Final List: కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్.. ఆ ఐదుగురు అభ్యర్థులు వీరే?
New Update

TS ELECTIONS: కాంగ్రెస్ టికెట్ల విషయంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. నిన్న(సోమవారం) కాంగ్రెస్ అధిష్టానం 16 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రెండు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. గతంలో రెండో జాబితాలో బోథ్ నియోజకవర్గం నుంచి వెన్నెల అశోక్ పేరు ప్రకటించగా.. తాజాగా ఆ నియోజకవర్గం నుంచి అశోక్ కు తొలిగించి ఆ స్థాన్నాన్ని ఆడే గజేందర్ కు కాంగ్రెస్ అధిష్టానం కేటాయించింది. అదేవిధంగా వనపర్తి టికెట్ ను గతంలో జిల్లెల చిన్నారెడ్డికి కేటాయించగా.. ప్రస్తుతం వనపర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మేఘ రెడ్డికి అవకాశం ఇస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

Also Read:ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం?

మూడో లిస్ట్ తర్వాత మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని అంతా భావించగా..  మళ్లీ ట్విస్ట్ ఇచ్చింది కాంగ్రెస్. మూడో లిస్ట్ లో 14 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా మిగతా ఐదు స్థానాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మిర్యాలగూడ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి.. అలాగే హైదరాబాద్ లోని చార్మినార్ టికెట్లను కాంగ్రెస్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ఖమ్మం, నల్లగొండ జిల్లాలే కాంగ్రెస్ కు కీలకమని తెలంగాణ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల చేరికతో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయిందన్న టాక్ ఉంది. వీరి రాకతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. ఇక తుంగతుర్తి నుంచి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కేవలం 2 వేలలోపు ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. గతంలో తుంగతుర్తి నుంచి బరిలో దిగిన అద్దంకి దయాకర్ కు మరోసారి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు గాంధీ భవన్ లో టాక్ వినిపిస్తోంది. ఇక అద్దంకి దయాకర్ కు కాకుండా.. పొంగులేటి పిడమర్తి రవికి, కోమటిరెడ్డి మోత్కుపల్లి నర్సింహులుకు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. కానీ తుంగతుర్తి టికెట్ మాత్రం అద్దంకి కి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

Also Read: రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతాం.. షర్మిలకు సొంత నేతల షాక్!

ఇప్పటికే కొత్తగూడెం నుంచి సీపీఐ బరిలో దిగుతుందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించగా.. సీపీఐ నుంచి కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మిర్యాలగూడ టికెట్ ను బత్తుల లక్ష్మారెడ్డి.. సూర్యాపేట నుంచి పటేల్ రమేష్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆఖరి నిమిషంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కూడా ఉంది.

#telangana-elections-2023 #congress-list
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe