TPCC Chief Revanth Reddy: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. తన చేతల్లో వేడి.. మాటల్లో వాడి స్పష్టంగా కనిపిప్తోంది. ఈ నేపథ్యంలోనే ముస్లిం ఓటర్లను కాంగ్రెస్ వైపు లాగేందుకు ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా పలువురు ముస్లిం నేతలను కలిసిన రేవంత్ రెడ్డి.. ముస్లింలకు కాంగ్రెఎస్ అండగా ఉంటుందనే భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్, ఎంఐఎంపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం(AIMIM)కు ఓటేస్తే బీజేపి(BJP)కి ఓటు వేసినట్లేనని అన్నారు. ఈ మూడు పార్టీల మధ్య సీక్రెట్ దోస్తీ నడుస్తోందని, కేంద్రం తీసుకువచ్చిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్(BRS) మద్దతు తెలుపడమే ఇందుకు నిదర్శనం అని అన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, నోట్ల రద్దు, అవిశ్వాస తీర్మానం, సీఏఏ, ఎన్ఆర్సీ, ట్రిపుల్ తలాక్ బిల్లు, జీఎస్టీ బిల్లు సహా పలు అంశాల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి.
పూర్తిగా చదవండి..TPCC Chief Revanth Reddy: ఎంఐఎం, బీఆర్ఎస్కి ఓట్లు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే.. ముస్లిం నేతలతో రేవంత్ కీలక వ్యాఖ్యలు..
బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే అని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, ఎంఐఎం(AIMIM)కు ఓటేస్తే బీజేపి(BJP)కి ఓటు వేసినట్లేనని అన్నారు. ఈ మూడు పార్టీల మధ్య సీక్రెట్ దోస్తీ నడుస్తోందని, కేంద్రం తీసుకువచ్చిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్(BRS) మద్దతు తెలుపడమే ఇందుకు నిదర్శనం అని అన్నారు.
Translate this News: