కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో (Khammam Congress) బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్ ( Sambhani Chandrasekhar) పార్టీని వీడనున్నారు. ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ (CM KCR) చంద్రశేఖర్ కు స్వయంగా పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని చంద్రశేఖర్ ను ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సంభానిని ఎంపీలు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. సంభాని చంద్రశేఖర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఓ దశలో ఆయన ఏపీకి పీసీసీ చీఫ్ కూడా అవుతారన్న చర్చ కూడా సాగింది.
ఇది కూడా చదవండి: Big Breaking: ఐటీ అధికారుల నిఘాలో నామినేషన్.. ఈసీకి పొంగులేటి కంప్లైంట్!
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి!
పాలేరు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆయనను ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.
Translate this News: