తెలంగాణ కాంగ్రెస్ లో (Telangana Congress) దాదాపు అరడజను మంది ముఖ్యమైన నేతలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారే. గత ఎన్నికల సమయంలో వీరిపై ఫుల్ ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు ఓటమి పాలయ్యేలా వ్యూహాలు రచించారు. ఆయన వ్యూహం సక్సెస్ కావడంతో వీరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగతా నేతలంతో ఓటమి పాలయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి కూడా కోదాడలో ఓడిపోయారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్ ఖతమైందని ప్రచారం జరిగినా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పరిస్థితి మళ్లీ మారిపోయింది. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి సత్తా చాటారు. అయితే.. అనంతరం జరిగిన హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ విజయం సాధించింది.
ఇది కూడా చదవండి: Big Breaking: బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి.. రాజగోపాల్ రెడ్డిపై పోటీకి సై?
TS Politics: టార్గెట్ నల్గొండ.. కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఇదే!
Translate this News: