Nandeeshwar Goud Interview: బీఆర్ఎస్ కు ఓటర్లు లేరు.. అందుకే బీజేపీ లీడర్లతో బేరం: నందీశ్వర్ గౌడ్ ఇంటర్వ్యూ

పటాన్ చెరు నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి లీడర్లు లేక బీఆర్ఎస్ లీడర్లను కొంటున్నారని ధ్వజమెత్తారు.

Nandeeshwar Goud Interview: బీఆర్ఎస్ కు ఓటర్లు లేరు.. అందుకే బీజేపీ లీడర్లతో బేరం: నందీశ్వర్ గౌడ్ ఇంటర్వ్యూ
New Update

బీఆర్ఎస్ నేతలు (BRS) అవినీతి డబ్బుతో అందరినీ కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ పటాన్ చెరు అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ (Nandeeshwar Goud) ధ్వజమెత్తారు. పార్టీ మారే వాళ్ళంతా కోవర్ట్ లేనని ఆరోపించారు. ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పటాన్ చెరు ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండరన్నారు. గూడెం మహిపాల్ రెడ్డి డబ్బుల కొరకు బంజరాహిల్స్ లో కౌంటర్ ఓపెన్ చేసుకున్నడని సంచలన ఆరోపణలు చేశారు.

ఇది కూడా చదవండి: బీజేపీ, కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లోకి కీలక నేతలు

ఈసారి పటాన్ చెరువు ప్రజలు స్థానిక ఎమ్మెల్యే ను బొంద పెట్టుడు ఖాయమన్నారు. పటాన్ చెరువు లో బీఆర్‌ఎస్ కు ఓటర్లు లేక తమ పార్టీ లీడర్లను కొంటున్నారని మండిపడ్డారు. ప్రజల్లో బీఆర్ఎస్ పై విశ్వాసం పోయిందన్నారు. నందీశ్వర్ గౌడ్ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి. నందీశ్వర్ గౌడ్ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

#telangana-elections-2023 #bjp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe