ఓటర్లపై సోషల్మీడియా ప్రభావం గట్టిగానే ఉంటుంది. ఇదే విషయం గత ఎన్నికల్లోనూ ప్రూవ్ అయ్యింది. పేజీలకు పేజీలు రాసుకోని ప్రత్యర్థులను విమర్శిస్తే జనాల్లో పోదు కానీ.. ఒక మీమ్ క్రియేట్ చేసి వదిలితే ఆ రీచ్ మాములుగా ఉండదు. దాని ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే రాజకీయ పార్టీలు సోషల్మీడియాపై చాలా కాలంగా, చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. రానున్న తెలంగాణ ఎన్నికలపైనా సోషల్మీడియా ప్రభావం గట్టిగానే ఉండనుంది. ఇది ఏదో ఎవరి నోటి నుంచో వచ్చిన గాలి మాట కాదు.. సాక్ష్యాత్తు ఫేస్బుక్ బయటపెడుతున్న నిజాలు. తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న ప్రధాన పార్టీలు ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ల కోసం భారీగా ఖర్చు పెడుతున్నాయట.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023: ఫేస్బుక్లో యాడ్ల కోసం కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు.. బీజేపీ, కాంగ్రెస్ ఖర్చుల లెక్క తెలిస్తే నోరెళ్లబెడతారు!
ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి. తెలంగాణలో ప్రకటనల కోసం ఫేస్బుక్లో అత్యధికంగా ఖర్చు చేస్తున్న పార్టీ బీజేపీ అని నివేదిక చెబుతోంది. తెలంగాణలో గత 90 రోజుల్లో దాదాపు 1.5 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో గడిచిన 30 రోజుల్లో 73 లక్షలు ఖర్చు చేశారు.
Translate this News: