తెలంగాణలో 64 సీట్లతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ (Congress Party).. సీఎం అభ్యర్థి ప్రకటన విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేరును దాదాపు ఫైనల్ చేసిన తర్వాత కూడా సీనియర్లు బ్రేకులు వేస్తుండడంతో ప్రకటన ఆగిపోతున్నట్లు తెలుస్తోంది. సీనియర్లను ఒప్పించిన తర్వాతే సీఎం అభ్యర్థిని ప్రకటించాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సీఎం రేసులో ముందు వరుసలో ఉంన్నారు. తాజాగా దామోదర రాజనర్సింహ కూడా సీఎం రేసులోకి వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్ల్ చర్చ సాగుతోంది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దామోదర కూడా తనను సీఎం చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎంగానూ పని చేశారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: రేవంత్ను సీఎం చేయొద్దు.. సీనియర్లు బలంగా వినిపిస్తున్న 5 వాదనలు ఇవే!
Telangana CM: సీఎం రేసులోకి దూసుకొచ్చిన దామోదర.. ఆయన ప్లస్ పాయింట్లు ఇవే!
తెలంగాణ సీఎం పదవి రేసులోకి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా వచ్చారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి, డిప్యూటీ సీఎంగా పని చేసిన తనకు అవకాశం కల్పించాలని ఆయన హైకమాండ్ ను కోరుతున్నట్లు సమాచారం.
Translate this News: