తెలంగాణలో మరో టాప్ కంపెనీ పెట్టుబడులు.. సీఎం రేవంత్ తో కీలక భేటీ!

అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన చార్లెస్ స్క్వాబ్కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్​మెంట్​ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

తెలంగాణలో మరో టాప్ కంపెనీ పెట్టుబడులు.. సీఎం రేవంత్ తో కీలక భేటీ!
New Update

ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన చార్లెస్ స్క్వాబ్ (Charles Schwab) కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్​మెంట్​ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్‌ ఇదే కావటం విశేషం. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో ఛార్లెస్ స్క్వాబ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు డెన్నిస్ హోవార్డ్, రామ బొక్కా గారి సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవెలప్​మెంట్​ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్ కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.


#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి