భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 2022 సంవత్సరంలో వరదలు సంభవించిన సమయంలో సీఎం కేసీఆర్ వచ్చారని, అప్పుడు వరదల కింద రూ. 1000 కోట్లు కేటాయించి.. వరద బాధితులకు పక్కా ఇండ్ల నిర్మించి ఇస్తామని, కరకట్ట ఎత్తును పొడిగిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అయితే సంవత్సరం గడుస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు వంద రూపాయలు కూడా హామీలో భాగంగా ఇవ్వలేదని, ఉచిత హామీలతో తన నియోజకవర్గం ప్రజలను మోసం చేశారంటూ భద్రాచలం పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు చేశారు.
పూర్తిగా చదవండి..తెలంగాణ సీఎంపై కేసు పెట్టిన ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై భద్రాచలం పోలీస్స్టేషన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు చేశారు. సీఎం ఇచ్చిన హామీ ప్రకారం ఇండ్లు కట్టించి ఇవ్వలేదని, భద్రాచలం దేవాలయాన్ని అభివృద్ధి చేయలేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో సీతారామచంద్రస్వామికి కళ్యాణానికి మొదటిసారి వచ్చినప్పుడు రూ. 100 కోట్లతో రామాలయం అభివృద్ధి చేస్తానని చెప్పి మాట తప్పారని ఎమ్మెల్యే పొదెం వీరయ్య చెప్పారు.

Translate this News: