Telangana BJP: సెల్యూట్ తెలంగాణ.. భాగ్యనగరంలో బీజేపీ భారీ ర్యాలీ!

కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ నగరానికి వచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతున్నారు. సెల్యూట్ తెలంగాణ పేరిట భారీ ర్యాలీని నర్వహిస్తున్నారు. ర్యాలీ అనంతరం బీజేపీ నూతన ఎంపీలు, ఎమ్మెల్యేలను సన్మానించనున్నారు.

New Update
Telangana BJP: సెల్యూట్ తెలంగాణ.. భాగ్యనగరంలో బీజేపీ భారీ ర్యాలీ!

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ తో సమానంగా 8 ఎంపీ సీట్లు దక్కడంతో బీజేపీ ఫుల్ జోష్‌ లో ఉంది. కేంద్ర మంత్రి వర్గంలోనూ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరికీ చోటు దక్కడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో సెల్యూట్ తెలంగాణ పేరిట భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నాంపల్లిలోని BJP ఆఫీస్‌ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది.

కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి నగరానికి వచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తమకు భారీ విజయం అందించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సెల్యూట్ తెలంగాణ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నేతలు తెలిపారు. ర్యాలీ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు సన్మానం చేయనున్నారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎంపీలు దర్శించుకోనున్నారు.

Advertisment
తాజా కథనాలు