తెలంగాణ బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే వందరోజుల ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అధికార పార్టీ వైఫల్యాలను ఎక్కడిక్కడ ఎండగడుతూ…కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తోంది. దీనిపై చర్చించేందుకు సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పై అంశాలపై చర్చించారు.
పూర్తిగా చదవండి..టీబీజేపీ 100రోజుల యాక్షన్ ప్లాన్…నడ్డా వార్నింగ్ వర్కవౌట్ అయినట్లేనా..?
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ బీజేపీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక రచిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను పరిగణలోనికి ఈ యాక్షన్ ప్లాన్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. వంద రోజుల పాటు నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..జనం సమస్యలపై పోరాడేలా ఈ ప్లాన్ ను రెడీ చేస్తున్నారు. అయితే నిన్నగాక మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా...టీబీజేపీ నేతలకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. లొల్లి పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలంటూ హెచ్చరించారు. మొత్తానికి జేపీ నడ్డా వార్నింగ్ పనిచేసినట్లే కనిపిస్తోంది.
Translate this News: