మంగళవారం అత్యధికంగా మియాపూర్ లో 4.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని షేక్ పేట, జూబ్లీహిల్స్ లో 4.1, మాదాపూర్ లో 3.7, కృష్ణానగర్ లో 3.5, చార్మినార్ 3.3, విజయనగర్ కాలనీలో 3.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. చిన్న చిన్న వర్షానికే బైలెన్లలో నీళ్లు నిలిచిపోతున్నాయి.మరోవైపు వాతావరణశాఖ తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Telangana Rains : తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
రాగల మూడు, నాలుగురోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తూ తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు మూడు రోజులుగా ఆగకుండా ముసురు పడుతుండగా... ఇవాళ్టి నుంచి మరో మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Translate this News: