సాయిచంద్…తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసన సమయంలో తన పాటతో కోట్లాది మందిని కదిలించారు. జానపదాన్ని నింపుకుని జనం గొంతుకై నిలిచిన పాటా వాడవాడలా ప్రతిధ్వనించింది. ఆయన పాటకు తెలంగాణ సమాజం ఉద్వేగంతో ఊగిపోయింది. ఉద్యమ సమయంలో సాయిచంద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సాయిచంద్ మరణవార్త విన్న తెలంగాణ సమాజం షాక్ కు గురైంది. కళాకారులు కన్నీటిపర్యంతమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సాయిచంద్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. సాయిచంద్ మరణ వార్త తెలియగానే పార్టీ ప్రముఖులంతా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వెళ్లి ఆయనకు నివాళులర్పించారు.
పూర్తిగా చదవండి..మూగబోయిన ఉద్యమ స్వరం..గుండెపోటుతో సాయిచంద్ హఠాన్మరణం..సీఎం సంతాపం..!!
తెలంగాణ ఫోక్ సింగర్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మరణించారు. నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కి వెళ్లారు సాయిచంద్. తన ఫామ్ హౌస్ లో అర్ధ రాత్రి అస్వస్థకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ లోని గాయత్రి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని కేర్ హస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే సాయిచంద్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సాయిచంద్ర మరణం పట్ల సీఎం కేసీఆర్ తోపాటు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సాయిచంద్ వయసు 39ఏళ్లు. విద్యార్థి దశనుంచే సాయిచంద్ గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
Translate this News: