/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Talasani-Srinivas-ACB.jpg)
గొర్రెల పంపిణీ స్కామ్లో ఏసీబీ దూకుడు పెంచింది. కీలక నిందితులను అరెస్టు చేసింది. పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ సబావత్ రాంచందర్ తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద OSDగా పని చేసిన కల్యాణ్ ను అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరు నిందితులు రూ.2.10 కోట్ల అవకతవకలకు పాల్పడ్డట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 10 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. దీంతో భవిష్యత్ లో ఈ కేసులో ఇంకా ఎవరిని అరెస్ట్ చేస్తారు? అన్న అంశం పశుసంవర్ధక శాఖ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గొర్రెల పంపిణీ పథక కుంభకోణంలో విచారణలో భాగంగా #ఏసిబి అధికారులు ఈ కేసుకు సంబంధించిన మరో ఇద్దరు అధికారులైన ఎస్. రాంచందర్, CEO, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ & జి. కళ్యాణ్ కుమార్, అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రికి OSD. ఈ ఇద్దరూ కలిసి కొందరు ప్రైవేట్… pic.twitter.com/1Kv8jzC1Vp
— ACB Telangana (@TelanganaACB) May 31, 2024