TDP-YCP: టీడీపీకి షాక్.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న తండ్రీ తనయుడు

కడపలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ, తనయుడు మణికంఠ శర్మ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

New Update
TDP-YCP: టీడీపీకి షాక్.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న తండ్రీ తనయుడు

TDP-YCP: ఏపీలో ఎన్నికల వేళ రాజీనామాల పర్వం కొనసాగుతుంది. టికెట్ దక్కని నేతలు సొంత పార్టీలకు గుడ్ బై చెబుతూ వేరే గూటికి చేరుతున్నారు. తాజాగా కడపలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ, తనయుడు మణికంఠ శర్మ వైసీపీలో చేరారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌ సమక్షంలో అధికార పార్టీ గూటికి చేరుకున్నారు.

Also read: అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. అభ్యర్థి మార్పుపై ఆందోళన..!

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, అఖిలభారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్‌ శర్మ కు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు