/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/tdp-14-jpg.webp)
TDP-YCP: ఏపీలో ఎన్నికల వేళ రాజీనామాల పర్వం కొనసాగుతుంది. టికెట్ దక్కని నేతలు సొంత పార్టీలకు గుడ్ బై చెబుతూ వేరే గూటికి చేరుతున్నారు. తాజాగా కడపలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ, తనయుడు మణికంఠ శర్మ వైసీపీలో చేరారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్ సమక్షంలో అధికార పార్టీ గూటికి చేరుకున్నారు.
Also read: అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. అభ్యర్థి మార్పుపై ఆందోళన..!
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, అఖిలభారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్ శర్మ కు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ వద్ద ముఖ్యమంత్రి శ్రీ @ysjagan సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు టీడీపీ నేతలు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన, వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన… pic.twitter.com/J1O9gDQ4B0
— YSR Congress Party (@YSRCParty) March 28, 2024