AP: టీడీపీ కార్యకర్త పొర్లు దండాలతో నిరసన.!

తూర్పుగోదావరి జిల్లా వేమగిరి తోటలో ఓ టీడీపీ కార్యకర్త వర్షపు నీటిలో పొర్లు దండాలు పెడుతూ నిరసనకు దిగారు. డ్రైనేజీలు తీయాలంటూ అధికారులను వేడుకున్నారు. చిన్నపాటి వర్షం వస్తే డ్రైనేజీ అంతా కాలనీలో ఉండిపోతుందని దీని వలన రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

AP: టీడీపీ కార్యకర్త పొర్లు దండాలతో నిరసన.!
New Update

East Godavari: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి తోటలో తెలుగుదేశం కార్యకర్త యనమదల రాజు వింత నిరసనకు దిగాడు. అధికారులు డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో చిన్నపాటి వర్షం వస్తే నీరు వెళ్లే మార్గం లేక ఆ కాలనీ అంతా మునిగి రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read: ఘోర ప్రమాదం.. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!

వర్షానికి కాలనీ జలమయం అయ్యిందని అధికారుల నిర్లక్ష్యం వలనే ఈ పరిస్థితి దాపరించిందని వాపోయిడు. వర్షపు నీటిలో అధికారులకు పొర్లు దండాలు పెడుతూ వింత నిరసన చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే వేమగిరి సెంటర్ లో కాలనీవాసులు అందరూ కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

#east-godavari
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe