AP: టీడీపీ కార్యకర్త పొర్లు దండాలతో నిరసన.!

తూర్పుగోదావరి జిల్లా వేమగిరి తోటలో ఓ టీడీపీ కార్యకర్త వర్షపు నీటిలో పొర్లు దండాలు పెడుతూ నిరసనకు దిగారు. డ్రైనేజీలు తీయాలంటూ అధికారులను వేడుకున్నారు. చిన్నపాటి వర్షం వస్తే డ్రైనేజీ అంతా కాలనీలో ఉండిపోతుందని దీని వలన రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
AP: టీడీపీ కార్యకర్త పొర్లు దండాలతో నిరసన.!

East Godavari: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి తోటలో తెలుగుదేశం కార్యకర్త యనమదల రాజు వింత నిరసనకు దిగాడు. అధికారులు డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో చిన్నపాటి వర్షం వస్తే నీరు వెళ్లే మార్గం లేక ఆ కాలనీ అంతా మునిగి రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read: ఘోర ప్రమాదం.. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!

వర్షానికి కాలనీ జలమయం అయ్యిందని అధికారుల నిర్లక్ష్యం వలనే ఈ పరిస్థితి దాపరించిందని వాపోయిడు. వర్షపు నీటిలో అధికారులకు పొర్లు దండాలు పెడుతూ వింత నిరసన చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే వేమగిరి సెంటర్ లో కాలనీవాసులు అందరూ కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు