TDP Vs YCP war over sand mafia: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. ఏపీలో అధికార వైసీపీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ టీడీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇసుక దోపిడీపై ఇవాళ, రేపు, ఎల్లుండు నిరసనలకు ప్లాన్ చేసింది టీడీపీ. మైలవరంలోని ఇసుక డంపింగ్ స్టాక్ పాయింట్ వద్ద టీడీపీ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమా, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి శావల దేవదత్ నిరసనకు దిగగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగగా.. టీడీపీ నేతల అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.
పూర్తిగా చదవండి..TDP vs Police: మైలవరంలో టెన్షన్.. పోలీసులు, టీడీపీ నేతల మధ్య ఘర్షణ
వైసీపీ ఇసుక దోపిడికి పాల్పడుతుందని ఆరోపిస్తూ టీడీపీ నిరసనలకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం అక్కడి టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. మైలవరంలోని ఇసుక డంపింగ్ స్టాక్ పాయింట్ వద్ద టీడీపీ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమా, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి శావల దేవదత్ నిరసనకు దిగగా పోలీసులు అడ్డుకున్నారు.
Translate this News: