AP: ఆళ్ళగడ్డలో ఆందోళన.. ఏవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్..!

AP: నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందు శ్రీదేవి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. శ్రీదేవి హత్యపై న్యాయం కోసం నిరహార దీక్ష చేపట్టారు. ఏపీ సుబ్బారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని, పార్టీ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

New Update
AP: ఆళ్ళగడ్డలో ఆందోళన.. ఏవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్..!

Allagadda: నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందు ఆందోళన నెలకొంది. టీడీపీ మహిళ నేత శ్రీదేవి (TDP Leader Sridevi) హత్య కేసులో న్యాయం కోసం బాధిత కుటుంబ సభ్యులు నిరహార దీక్ష చేపట్టారు. ఏవి సుబ్బారెడ్డిని (AV Subba Reddy) వెంటనే పార్టీ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం ఆగదని తేల్చిచెబుతున్నారు.

Also Read: జూలై 4వ తేదీ విద్యాసంస్థల బంద్: AISF

ఏవి సుబ్బారెడ్డిని త్వరగా అరెస్ట్ చేయాలని శ్రీదేవి కొడుకు అట్లా హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. పార్టీ హై కమాండ్ స్పందించి త్వరగా తమకు న్యాయం చేయాలన్నారు. ఈరోజు మా అమ్మను చంపేశారు రేపు మమ్మల్ని కూడా చంపేస్తారని.. ఏవి సుబ్బారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

Also Read: దయనీయంగా రైతుల పరిస్థితి.. 250 మంది ఆత్మహత్య..!

కాగా, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అఖిలప్రియ (Akhila Priya) అనుచరుడు టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీదేవిపై ఈ నెల 25న దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీదేవి చనిపోగా.. తీవ్ర గాయాలైన భాస్కర్ రెడ్డి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డితో మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisment
తాజా కథనాలు