TDP: కోడికత్తి కేసు శ్రీనుని కలవడానికి వెళ్లిన టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు.. అడ్డుకున్న అధికారులు.!

విశాఖ సెంట్రల్ జైల్లో కోడికత్తి కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ తో ములాఖత్ అయ్యేందుకు వెళ్లారు టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు. అయితే, వారిని జైలు అధికారులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో జనుపల్లి శ్రీనివాస్ కు న్యాయం చేయాలంటూ జైలు బయట నిరసన చేపట్టారు.

New Update
TDP: కోడికత్తి కేసు శ్రీనుని కలవడానికి వెళ్లిన టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు.. అడ్డుకున్న అధికారులు.!

TDP: విశాఖ సెంట్రల్ జైల్లో కోడి కత్తికేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ గత నాలుగున్నర సంవత్సరాలుగా జైలు మగ్గిపోతున్నాడు. తనకు న్యాయం చేయాలని వారం రోజులుగా నిరసన దీక్ష చేపట్టాడు. మరో వైపు తన కొడుకును జైలు నుండి విడింపించాలని శ్రీను తల్లిదండ్రులు కూడా విజయవాడలో దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితుడు శ్రీనుతో ములాఖత్ అయ్యేందుకు వెళ్లారు టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు.

Also Read: వేరే మతస్తుడిని ప్రేమించిందని సొంత చెల్లినే..

అయితే, వారిని జైలు అధికారులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో జనుపల్లి శ్రీనివాస్ కు న్యాయం చేయాలంటూ జైలు బయట టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు నిరసన చేపట్టారు. శ్రీను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర ఎస్సీ నాయకుడు పుచ్చ విజయకుమార్ మాట్లాడుతూ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దాళితులను అడ్డుపెట్టుకొని సీఎం జగన్ అధికారంలోకి వచ్చారని..అయితే అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు చేస్తున్నాడని ఆరోపించారు.

Also Read: కళ్యాణ్ కన్నింగ్ ప్లాన్..కావ్యను చీరతో కట్టి రాజ్ ఏం చేశాడంటే?

కోడి కత్తి కేసులో బాధితుడైన జగన్ జైలుకువచ్చి సాక్ష్యం చెప్పడానికి అడ్డంకి ఏంటి? అని ప్రశ్నించారు. నాలుగున్నర ఏళ్లుగా బెయిల్ రాక జైల్లోనే మగ్గిపోతున్న దళిత యువకుడు శ్రీనివాస్ కు దిక్కేది? అంటూ ప్రశ్నిస్తున్నారు. కోడి కత్తి కేసులో శ్రీనివాస్ కు ఎన్వోసీ ఎన్నోసార్లు ఇవ్వాలని..లేదా కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పాలని అన్నారు. దళితులపై ప్రేమ ఒలకపోస్తునట్లు జగన్ నటన ఆపాలని డిమాండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు