Attack On YCP Leaders: జగన్ అడ్డాలో టీడీపీ నేతల దాడులు

AP: జగన్ అడ్డాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. పులివెందులలో వైసీపీ సోషల్ మీడియా యూట్యూబర్ సుంకేసుల ఆదిశేషు ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. భార్య గర్భవతి అని కూడా చూడకుండా ఇంట్లోకి దూరి వేటకొడవళ్లతో హల్‌చల్‌ చేశారు. తమకు రక్షణ కల్పించాలంటూ ఆదిశేషు పోలీసులను కోరారు.

New Update
Attack On YCP Leaders:  జగన్ అడ్డాలో టీడీపీ నేతల దాడులు

TDP Attack On YCP Leaders: ఏపీలో రాజకీయ దాడులు ఆగడం లేదు. పులివెందులలో వైసీపీ సోషల్ మీడియా యూట్యూబర్ సుంకేసుల ఆదిశేషు ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. భార్య గర్భవతి అని కూడా చూడకుండా ఇంట్లోకి దూరి వేటకొడవళ్లతో హల్‌చల్‌ చేశారు. ఆదిశేషు తల్లి, భార్య భయబ్రాంతులకు గురయ్యారు. ఇంట్లో ఉన్న ఫర్నీచర్, వాహనం ధ్వంసం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై ఆదిశేషు ఘాటు విమర్శలు చేశాడు. పులివెందులలోని లింగాలలో షర్మిల ప్రచారాన్నిఅడ్డుకునే ప్రయత్నం చేశాడు ఆదిశేషు. టీడీపీ అదికారంలోకి వచ్చిన రోజు నుంచి తమపై దాడులు చేస్తున్నారని ఆదిశేషు ఆరోపించారు. తమకు టీడీపీ గుండాల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

ఏపీలో రక్షణ కరువైంది: జగన్ 

అధికారం కోల్పోయాక మాజీ ముఖ్యమంత్రి జగన్ తొలిసారి సోషల్ మీడియాలో స్పందించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. 

Advertisment
తాజా కథనాలు