Nazeer: సీఎం జగన్ ఇందుకే మరోసారి సిద్ధం అంటున్నాడు: టీడీపీ నేత నజీర్

రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి జగన్ మరోసారి సిద్ధమంటున్నాడని కామెంట్స్ చేశారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్డీ నజీర్. మరోసారి అధికారం ఇస్తే రూ. 25 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో అమ్మేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nazeer: సీఎం జగన్ ఇందుకే మరోసారి సిద్ధం అంటున్నాడు: టీడీపీ నేత నజీర్
New Update

Nazeer: ప్రజలపై కక్ష సాధించడానికే సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి సిద్ధం అంటున్నాడని కామెంట్స్ చేశారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్డీ నజీర్. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మరోసారి సిద్ధమంటున్నాడని పేర్కొన్నారు. ప్రజలకు అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. నేటికి 11 లక్షల 29 వేల కోట్లు రూపాయలు అప్పులు చేశారని విమర్శించారు. మరోసారి అధికారం ఇస్తే రూ. 25 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో అమ్మేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్రా పోలీసులు

రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 53 ఎకరాలు ఇవ్వలేదని రైల్వే శాఖామంత్రే స్పష్టంగా చెప్పారన్నారు. స్ధలం ఇవ్వకపోతే రైల్వేజోన్‌‌‌ బంగాళాఖాతంలో పెడతారా? అని ప్రశ్నించారు. లక్షల రూపాయిలు హోర్డింగుల కోసం ఖర్చుపెట్టారు..అది ఎవరి సొత్తు? అని నిలదీశారు. జగన్ పాలనపై విసిగిపోయిన ప్రజలు ఆయనను ఓడించడానికి సిద్దంగా వున్నారని సీఎం తెలుసుకోవాలన్నారు.

Also Read: తిరుమలలో మంత్రి రోజాకి రాజధాని సెగ.. జై అమరావతి అంటూ నినాదాలు..!

కాగా, ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు టీడీపీ ఇటు వైసీపీ నేతలు పోటాపోటీగా ప్రజల మధ్యన తిరుగుతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఏపీకి రాజధాని లేకుండా చేసిన ఘనుడు సీఎం జగన్ అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, ఎంత మంది వచ్చినా సరే జగన్ ను ఓడించలేరంటూ వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

#andhra-pradesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి