TDP: ఘనంగా టీడీపీ బీసీ గర్జన మినీ మహాసభలు.!

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో జయహో తెలుగుదేశం బీసీ గర్జన మినీ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ..వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. టీడీపీ గెలుపు కోసం బీసీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

New Update
TDP: ఘనంగా టీడీపీ బీసీ గర్జన మినీ మహాసభలు.!

TDP BC Garjana Mini Mahasabha: తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో జయహో తెలుగుదేశం బీసీ గర్జన మినీ మహాసభలు నిర్వహించారు. పట్టణంలోని SLR కళ్యాణ మండపంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుతం వైసీపీ పాలన ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగిందని అన్నారు. గతంలో బీసీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎంతో సహాయ పడిందని వ్యాఖ్యనించారు. గత ప్రభుత్వ పాలనలో బీసీలకు ఆర్థికంగా కార్పొరేషన్ ద్వారా ఎన్నో రుణాలు అందించిందని గుర్తి చేశారు.

Also Read: ఆచంట నియోజకవర్గంలో ఎన్నికల వేడి.. పోటా పోటీగా టీడీపీ వైసీపీ ప్రచారాలు.!

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలకాలని కోరారు. గెలుపు కోసం నాయకులు బిసి నాయకులకు కార్యకర్తలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిజం గెలవాలి అని నినాదంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల ఫిబ్రవరి రెండో తేదీన నియోజకవర్గంలో పర్యటించనున్నారన్నారు. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  జైలుకెళ్ళిన నేపథ్యంలో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను నార భువనేశ్వరి పరామర్శిస్తారని తెలిపారు. అంతేకాకుండా పార్టీ నుండి పారితోషం అందించనున్నారని వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు