TDP-Janasena Allianace: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అధికారికంగా ప్రకటించడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రేపటి నుంచే ఉమ్మడిగా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని పవన్ స్పష్టంచేశారు. దీంతో జనసైనికులు, పసుపు కార్యకర్తలు యుద్ధానికి రెడీ అంటున్నారు. ఇప్పటి నుంచి ఓ లెక్క.. ఇక నుంచి ఓ లెక్క అంటున్నారు. జగన్ (YS Jagan)ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు కేసులు, మరోవైపు విమర్శల దాడితో సైలెంట్ అయిపోయారు. అయితే యువనేత లోకేష్ (Lokesh) పాదయాత్రతో టీడీపీ క్యాడర్లో మళ్లీ జోష్ వచ్చింది. అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో నాయకుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ క్రమంలో ఒక్కసారిగా పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా స్తబ్దత ఏర్పడింది.
పూర్తిగా చదవండి..TDP-Janasena: యుద్ధానికి రెడీ.. ఇప్పటి నుంచి ఓ లెక్క.. ఇక నుంచి ఓ లెక్క అంటున్న టీడీపీ-జనసేన
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత వవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రేపటి నుంచే ఉమ్మడిగా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని పవన్ స్పష్టంచేశారు. దీంతో జనసైనికులు, పసుపు కార్యకర్తలు యుద్ధానికి రెడీ అంటున్నారు. ఇప్పటి నుంచి ఓ లెక్క.. ఇక నుంచి ఓ లెక్క అంటున్నారు.
Translate this News: