TDP: మద్యంతో నెల్లూరు వైసీపీ ఎంపీ, జగన్ అక్రమంగా సంపాదిస్తున్నారు.. ఆనం హాట్ కామెంట్స్..!

రాష్ట్రంలో మద్యం తయారీ, అమ్మకాలపై ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. నకిలీ మద్యంను అధిక ధరకు అమ్ముకుంటూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

TDP: మద్యంతో నెల్లూరు వైసీపీ ఎంపీ, జగన్ అక్రమంగా సంపాదిస్తున్నారు.. ఆనం హాట్ కామెంట్స్..!
New Update

TDP Anam Ramanarayana Reddy: మాజీ మంత్రి ఆత్మకురు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మద్యం వ్యాపారంతో ప్రజలను నష్టపరుస్తున్న ఘనత జగన్ దేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో మద్యం అమ్మకాలపై, మద్యం తయారీపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

Also Read: మా నాన్న గురించి మాట్లాడొద్దంటే ఎలా.. సునీత సీరియస్ కామెంట్స్..!

నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి.. తాను సొంతంగా తయారు చేస్తున్న మద్యంను అధిక ధరకు అమ్ముకుంటూ.. భారీగా అక్రమ సంపాదన సంపాదిస్తున్నారని ఆరోపించారు. వీరు తయారు చేస్తున్న నకిలి మద్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని దీనిపై ల్యాబ్ టెస్టింగ్ రిపోర్టు ఇచ్చారంటూ తెలిపారు.

Also Read: మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు హైకోర్టు షాక్‌

రాష్ట్రంలో ప్రజలు ఎలా పోయినా తమకు అవసరం లేదని తమ సొంతంగా తయారు చేసుకున్న మద్యానికి వారే ధర నిర్ణయించుకొని వచ్చిన డబ్బులను పంచుకుంటున్నారు అంటూ నిప్పులు చెరిగారు. ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని పక్కనపెట్టి తిరిగి టీడీపీ గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు..

#cm-jagan #tdp-anam-ramanarayana-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి