TDP Abdul Aziz: సమన్వయం పాటించాలి.. కార్యకర్తలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు హెచ్చరిక..!

టీడీపీ కార్యకర్తలు సమన్వయం పాటించాలన్నారు నెల్లూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్. గతంలో ఇబ్బంది పడ్డామని.. ఇప్పుడు దాడులకు పాల్పడవద్దని హెచ్చరించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కామెంట్స్ చేశారు.

TDP Abdul Aziz: సమన్వయం పాటించాలి.. కార్యకర్తలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు హెచ్చరిక..!
New Update

TDP Abdul Aziz: ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపడితే రాష్ట్ర ప్రజల కళ్ళలో ఆనందం కనిపించిందన్నారు నెల్లూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో పదికి పది స్థానాలని టీడీపీకి ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read: డయేరియా కలకలం.. ఒకరు మృతి.. 50 మంది అస్వస్థత.!

పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి ఇచ్చిన అన్ని హామీలు సంపూర్ణంగా అమలు చేస్తామన్నారు. నిన్న తొలి ఐదు సంతకాలు రాష్ట్ర ప్రజల కోసం పెట్టారని.. రాబోయే ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని కామెంట్స్ చేశారు. భారీ పరిశ్రమలు వస్తాయని.. రాజధాని (AP Capital) అభివృద్ధి జరుగుతుందని.. పోలవరం పూర్తి చేస్తామని., మద్యం పాలసీ తీసుకువస్తున్నామని తెలిపారు.

Also Read: ఏపీలో దారుణం.. కన్న తండ్రిని కిరాతకంగా కొట్టి చంపిన కూతురు..!

టీడీపీ కార్యకర్తలు సమన్వయం పాటించాలన్నారు. గతంలో మనం ఇబ్బంది పడ్డామని.. ఇప్పుడు దాడులకు పాల్పడవద్దని అన్నారు. చట్టపరంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబు ఏపీని దేశంలోనే నెంబర్ 1గా నిలబెడుతారని పేర్కొన్నారు.

#tdp-abdul-aziz #tdp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe