AP Politics: ఎవరు ఎలాంటి వారో ఈరోజే తెలిసింది.. ఉండవల్లి శ్రీదేవి ఎమోషనల్ ట్వీట్

ఈ రోజు టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఉండవల్లి శ్రీదేవి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ''రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది!!" అంటూ ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

AP Politics: ఎవరు ఎలాంటి వారో ఈరోజే తెలిసింది.. ఉండవల్లి శ్రీదేవి ఎమోషనల్ ట్వీట్
New Update

Vundavalli Sridevi: కొన్ని నెలల క్రితం వైసీపీని వీడి టీడీపీలో (TDP) చేరిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాజాగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ రోజు విడుదలైన టీడీపీ అభ్యర్థుల జాబితాలో తనకు టికెట్ కేటాయించకపోవడాన్ని వెన్నుపోటులా భావిస్తున్నట్లు ఆ ట్వీట్ లో స్పష్టం అవుతోంది. టీడీపీలో చేరిన సమయంలో తాను తాడికొండ నుంచి పోటీ చేస్తానని చంద్రబాబుకు (Chandrababu) శ్రీదేవి చెప్పినట్లు సమాచారం. ఒక వేళ తాడికొండ టికెట్ ఇవ్వడం కుదరకపోతే తిరువూరు అసెంబ్లీ, బాపట్ల ఎంపీ స్థానాలకు తన పేరు పరిశీలించాలని కోరినట్లు ఆమె వర్గీయులు చెబుతున్నారు.

అయితే.. తాజా లిస్టులో ఈ మూడు నియోజకవర్గాల్లో వేరే వారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. దీంతో తీవ్ర ఆసంతృప్తికి గురైన శ్రీదేవి.. రాజకీయాలు ఎలా ఉంటాయో ఇవాళ తెలిసిందంటూ ట్వీట్ చేశారు. బాపట్లను ట్యాగ్ చేస్తూ పక్కనే వెన్నుపోటును సూచించేలా కత్తి సింబల్‌తో ట్వీట్ చేశారు. దీంతో ఈ అంశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది.

Also Read: కేజ్రీవాల్ అరెస్ట్.. కోర్టు కీలక నిర్ణయం?

#jana-sena-tdp #chandrababu #ap-politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe