పార్టీ మారిన బీఆర్ఎస్ నేతలపై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి (Pilot Rohith Reddy) నిప్పులు చెరిగారు. అమ్ముడు పోయిన కొడుకుల్లారా? ఖబర్దార్ అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ను (BRS Party) మోసం చేయడానికి సిగ్గుండాలన్నారు. కొందరు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి జరిగే నష్టం లేదన్నారు. తాండూరు అభివృద్ధి కోసం తాను కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి చేరినట్లు చెప్పారు. తాను ఎలాంటి డబ్బులకు ఆశపడి పార్టీ మారలేదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానన్నారు. ఫామ్హౌస్లో బేరం పెట్టినా తాను అమ్ముడుపోలేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: Eatala Rajendar: కాళేశ్వరంతో లక్ష కోట్లు గంగ పాలు.. కేసీఆరే కారణం: ఈటల తూటాలు
Pilot Rohith Reddy: అమ్ముడు పోయిన కొడుకుల్లారా.. మిమ్ముల్ని వదలం: రోహిత్ రెడ్డి వార్నింగ్
పార్టీ మారిన నేతలపై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రెచ్చిపోయారు. అమ్ముడు పోయిన నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను, పట్నం మహేందర్ రెడ్డి కలిసి పని చేస్తున్నట్లు చెప్పారు.
Translate this News: