2007 వన్డే ప్రపంచకప్ భారత్ క్రికెట్ అభిమానులకు ఓ పీడకల. టీమిండియా అభిమానులు ఇప్పటికీ వేధిస్తున్న వరల్డ్ కప్ అది. అప్పటి రోజులను గుర్తుతెచ్చుకుంటే ఇప్పటికీ బాధ కలుగుతుంది ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఇండియన్ టీమ్ టోర్నీ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఫస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఓడిపోవడంతో తర్వాత బెర్ముడాపై గెలిచినా..లీగ్ చివరి మ్యాచ్ శ్రీలంక చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది! నిజానికి రెండు స్ట్రాంగ్ టీమ్స్, రెండు చిన్న టీమ్స్ కలయికతో ఐసీసీ గ్రూప్స్ని విభజించింది. మన గ్రూప్లో బంగ్లాదేశ్, బెర్ముడా చిన్న జట్లు. ప్రతి గ్రూప్ నుంచి రెండు టీమ్స్ తర్వాతి రౌండ్కి వెళ్తాయి. ఇండియా, శ్రీలంక ఈజీగా నెక్ట్స్ గ్రూప్కి వెళ్తాయని అంతా భావించగా..బంగ్లాదేశ్ ఇచ్చిన షాక్తో టీమిండియా తెల్లబోయింది. నాటి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 49.3ఓవర్లలో 191పరుగులకు ఆలౌట్ అవ్వగా.. బంగ్లాదేశ్ 48.3ఓవర్లలో టార్గెట్ని ఛేజ్ చేసి ఇండియాకు షాక్ ఇచ్చింది. స్లో పిచ్పై 53బంతుల్లోనే 51పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఇన్నింగ్స్ విలువెంటే ఎవర్ని అడిగినా చెబుతారు. 16 ఏళ్లగా బంగ్లాదేశ్ క్రికెట్కి మరుపురాని విజయాలు అందించిన తమీమ్ ఇక్బాల్ ఇప్పుడు రిటైర్ అవుతున్నారన్న వార్త బంగ్లాదేశ్ అభిమానులను షాక్కి గురిచేసింది.
పూర్తిగా చదవండి..Cricket: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్.. 2007ప్రపంచకప్లో టీమిండియాను ఇంటికి పంపిన ఆటగాడు
మరో మూడు నెలల్లో ప్రపంచ కప్ మొదలవుతున్న సమయంలో బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ షాక్ ఇచ్చాడు. అన్నీఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ ప్రయాణంలో నిరంతరం తనతో ఉంటూ తనపై నమ్మకం ఉంచిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పిన తమీమ్ కన్నీంటి పర్యంతమయ్యాడు.
Translate this News: