Ram Mandir: రేపు (సోమవారం జనవరి 22) అయోధ్యలో రామమందిరం (Ram Temple)ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు సామాన్య భక్తుల నుంచి 8వేల మంది వీఐపీల వరకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో భారీ ఏర్పాట్లతోపాటు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట(Prana prathista)కు సంబంధించిన కార్యక్రమాన్ని దేశంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ రోజును గుర్తుండిపోయేలా చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. అదే సమయంలో, చాలా ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి.జనవరి 22న రామ్లల్లా పట్టాభిషేకం కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. స్టాలిన్ ప్రభుత్వం(Stalin’s government)పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తీవ్ర ఆరోపణ చేశారు. సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేశారు.
పూర్తిగా చదవండి..Ram Mandir: నిర్మలమ్మ గుస్సా…స్టాలిన్ సర్కార్ వివరణ..!!
స్టాలిన్ ప్రభుత్వంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రామభక్తులను బెదిరిస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. రామ్లల్లా పట్టాభిషేకం ప్రత్యక్ష ప్రసారం చేయడంపై నిషేధం విధించిందన్నారు. కేంద్ర మంత్రి ఆరోపణలు నిరాధారమైనవని డీఎంకే పేర్కొంది.
Translate this News: