Weather Alert: ఈ వేసవికి ఎండలు దంచికొడతాయి: ఐఎండీ హెచ్చరిక
దేశంలో ఈ వేసవికి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్నీనో ప్రభావంతోనే ఈసారి ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు పేర్కొంది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటకలో సాధారణం కంటే వేడి గాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది.