YCP vs TDP: ఢిల్లీకి చేరిన దొంగ ఓట్ల పంచాయతీ.. ఈసీకి వైసీపీ, టీడీపీ పోటాపోటీ ఫిర్యాదులు!
ఓటర్ల జాబితాలో అవకతవకలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య కొనసాగుతున్న వార్ ఢిల్లీకి చేరనుంది. బోగస్ ఓట్ల వ్యవహారంపై పరస్పరం ఫిర్యాదులు చేసేందుకు రెండు పార్టీలు ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC)ని కలవనున్నాయి. రెండు పార్టీల నేతలకు గంట వ్యవధిలో సీఈసీ అపాయింట్మెంట్లు ఇచ్చింది. కనీసం 60 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని..ఇది చంద్రబాబు హయాంలోనే జరిగాయని వైసీపీ ఆరోపిస్తుండగా.. టీడీపీ సానుభూతిపరుల పేర్లను తొలగిస్తున్నారని టీడీపీ వాదిస్తోంది