CM Jagan: ఏపీ సీఎంకి ఎంఆర్ఐ స్కానింగ్!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా తీవ్రమైన కాలి మడమ నొప్పితో బాధపడుతున్న ఆయన విజయవాడలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా తీవ్రమైన కాలి మడమ నొప్పితో బాధపడుతున్న ఆయన విజయవాడలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఏపీలో రాజకీయ వేడి రోజురోజుకి పెరిగిపోతుంది. తాజాగా ఓటర్ల జాబితా ల గురించి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు, ఓటర్లు జాబితాలో పేర్ల విషయంలో నిత్యం ఆందోళన కొనసాగుతుందన్నారు.
రాబోయే చంద్రన్న ప్రభుత్వంతో ప్రజల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని వెల్లడించారు తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తోన్న నారా లోకేష్ పాదయాత్ర.. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ నుంచి ఆదివారం సాయత్రం ప్రారంభమైంది. యువనేత లోకేష్ కు మద్దతు ఇస్తూ యువతీ యవకులు భారీగా రోడ్లపైకి తరలి వస్తున్నారు. అడుగడుగునా లోకేష్ కు విజయవాడ ప్రజలు లోకేష్ కు ఆత్మీయ స్వాగతం పలికారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను లోకేష ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు.
విజయవాడకు చెందిన సుంకర రజనీ అనే మహిళ మచిలీపట్నం, ఇనకుదురులో 14 సెంట్ల స్థలాన్ని రూ.35 లక్షల పెట్టి కొనుగోలు చేసింది. అయితే కొంత కాలం నుంచి ఈ స్థలాన్ని అమ్మేందుకు ఎంత ప్రయత్నించినా తిరిగి అమ్ముడు పోవడం లేదు. దీంతో రజనీ ఆందోళనకు గురైంది. అయితే తనకు సన్నిహితంగా ఉన్న ఒక మహిళతో ఈ సమస్యను పంచుకుంది. ఈమె అప్పుడు మేకుల బాబా గురించి చెప్పింది. దీంతో రజినీ నేరుగా అతన్ని కలిసి, స్థలం సమస్య చెప్పింది. ఇదే అదునుగా భావించిన దొంగ బాబా.. భారీగా సొమ్ము కాజేసేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. స్థలం అమ్ముడు పోవాలంటే స్థలంలో మేకులు కొట్టాలని చెప్పి రూ.2.5 లక్షలు తీసుకుని 4 మేకులు పాతాడు. ఇక రజినీకి నమ్మకం కుదిరేందుకు 100 గజాలు అమ్మించాడు. దీంతో ఆ దొంగ బాబా భయపెట్టడం మొదలు పెట్టాడు. స్థలం అమ్మిన తర్వాత నాలుగు లక్షలు కమీషన్ ఇవ్వకపోతే శాపం తగులుతుందని అన్నాడు. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేడు ఉమ్మడి కృష్ణాజిల్లాకు నారా లోకేష్ పాదయాత్ర చేరుకుంటుంది. ఈ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. లోకేష్ 'స్వాగతం సుస్వాగతం' అంటూ భారీగా స్వాగత బ్యానర్లను ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు .
ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన హయత్ ప్లేస్ హోటల్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలు దేరనున్నారు. పర్యాటక రంగంలో అంత్యంత కీలకమైన స్టార్ హోటల్స్ స్థాపనలో ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన 'హయల్ ప్లేస్' విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన ఫోర్త్ స్టార్ హోటల్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ కాలేజీలో(2019) బీఎడ్ చదివే సమయంలోనే అలోకం పవన్, ఎలి నాగేశ్వర రావు మధ్య ప్రేమ చిగురించింది. సుమారు ఆరు సంవత్సరాలుగా పవన్, నాగేశ్వర రావు సహజీవనం చేశారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందాం అని నిశ్చయించుకున్నారు. దీంతో ఢిల్లీకి తీసుకెళ్లి ప్రియుడు నాగేశ్వర రావు పవన్ కు ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ చేయించాడు. పవన్ ను భ్రమరాంబికగా మారడానికి రూ.11 లక్షలు ఖర్చు అయ్యాయి. అవయవ మార్పిడి ఆపరేషన్ కు అవసరమైన ఖర్చును మొత్తం పవనే భరించాడు. అలాగే నాగేశ్వరరావును నమ్మి అతనికి 11 సవర్ల బంగారం, 26 లక్షల నగదు ఇచ్చాడు పవన్. కట్ చేస్తే.. పవన్ అలియాస్ భ్రమరాంబిక ఆపరేషన్ చేసిన ఏడాది తర్వాత నాగేశ్వర రావు అసలు రూపం బయట పడింది. గత ఏడాది డిసెంబర్ నెలలో పెళ్లికి నిరాకరించాడు నాగేశ్వర రావు. దీంతో భ్రమరాంబిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. భ్రమరాంబిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రియుడు నాగేశ్వర రావు పరారీలో ఉన్నాడు.
కృష్ణా జిల్లా పెడనలో ఓ వ్యక్తి పై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దారుణంగా దాడి చేశారు. కప్పల దొడ్డికి చెందిన పంతం బలరాం అనే వ్యక్తి మంగళవారం ఉదయం రోజూ లాగే మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాడు. ఇంతలో ఇద్దరు యువకులు అకస్మాత్తుగా వచ్చి బలరాంపై కత్తులతో దాడికి దిగారు. దీంతో తీవ్ర గాయాల పాలైన బలరం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బలరాంను స్థానికులు మచిలీ పట్నలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బలరాం నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. తనపై యర్రా దేవన్, యర్రా జీవన్ లు కలిసి కత్తులతో దాడికి పాల్పడ్డాడని బలరాం వెల్లడించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
77వ స్వాతంత్ర్య దినోత్స వేడుకలు అంబరాన్నంటాయి. దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్స వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పంద్రాగష్టు వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సీఎం జగన్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు మెడల్స్ ప్రదానం చేశారు సీఎం. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు మెడల్స్ ప్రదాన సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గ్రే హౌండ్స్ కు చెందిన గౌరు నాయకుడుకు మెడల్ ప్రధానం చేశారు సీఎం జగన్. ఆ తర్వాత గౌరు నాయుడు సెల్యూట్ చేస్తుండగా బహుకరించిన మెడల్ కిందపడటంతో.. సీఎం జగన్ వెంటనే కింద పడిన మెడల్ ను తీసి మళ్లీ.. సంబంధిత వ్యక్తికి ప్రదానం చేశారు. దీంతో గౌరు నాయుడు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.