Vijayawada: కృష్ణలంకను ఆదుకున్న రిటైనింగ్ వాల్..
విజయవాడలోని కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు వరద ముప్పు తప్పింది. ఇందుకు కారణం అక్కడ రిటైనింగ్ వాల్ ఉండటమే. మొత్తం 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా ఈ ప్రహారి గోడ నిర్మించారు.
విజయవాడలోని కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు వరద ముప్పు తప్పింది. ఇందుకు కారణం అక్కడ రిటైనింగ్ వాల్ ఉండటమే. మొత్తం 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా ఈ ప్రహారి గోడ నిర్మించారు.
విజయవాడలోని సింగ్నగర్లో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆహారం లేక జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీలకు ఇంకా తాగునీరు చేరలేదు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో 5 హెలికాప్టర్లు, డ్రోన్లతో ఆహారం సరఫరా చేస్తున్నారు.
విజయవాడలో కొందరు కక్కుర్తి గాళ్లు బోట్ల దందా మొదలుపెట్టారు. వరదల వల్ల ఇంత ప్రళయం జరిగినా కూడా దాన్ని ఆసరగా చేసుకోని బోట్ల యజమానులు జనాల వద్ద డబ్బులు దండుకున్నారు. బోటు ప్రయాణానికి రూ.1500 నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు.
121 ఏళ్ల చరిత్రలో ప్రకాశం బ్యారేజీకి ఇదే అతిపెద్ద వరద అని ఆంధ్రప్రదేశ్ సీఎంవో ట్వీట్ చేసింది. 1903, 2009లో అత్యధికంగా పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం దాటగా.. ఇప్పుడు ఏకంగా 11.36 లక్షల క్యూసెక్కులు దాటేసినట్లు పేర్కొంది.
భారీ వర్షాల వల్ల హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు వాగు ఉధృతంగా ప్రవాహిస్తుండడంతో సూర్యాపేట- ఖమ్మం, హైదరాబాద్ నుంచి కోదాడ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను నిలిపివేశారు.
భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం అర్థరాత్రి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షించారు.ముంపు ప్రాంతాల్లో బోటులో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పెనుప్రమాదం తప్పింది. ఆయన పర్యటిస్తున్న బోటు ఒక్కసారిగా పక్కకి ఒరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది..బోటును తిరిగి యథాస్థితికి తీసుకుని వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారెజీలో నీరు 9 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. 300కు పైగా గ్రామాలకు ముప్పు ఉండగా ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు.
ఏపీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. విజవాడను వరద ముంచెత్తింది. ఇళ్లు, అపార్ట్మెంట్లన్నీ జలదిగ్బంధమయ్యాయి. ఇందుకు సంబంధించి RTV ఎక్స్ క్లూజివ్ డ్రోన్ విజువల్స్ ఈ వీడియోలో చూడండి.