ఏపీ బడ్జెట్.. మెగా డీఎస్సీ, తల్లికి వందనంపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన!
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నియామకాన్ని ప్రకటించామని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీని నెరవేరుస్తుందన్నారు.